Thursday 3 April 2014
Thursday 27 March 2014
పరిశ్రమద్వారా ఆత్మవిశ్వాసం
పరీక్షా ఫలితాలు వచ్చాయి.
ఫలితాలు వినిపించేందుకు ఆచార్యుడు వచ్చినిలుచున్నాడు. విద్యార్థులందరి
పేర్లు చదివి వినిపించాడు, ఒక విద్యార్థి లేచి చెప్పాడు,నా పేరు చదవలేదు.
క్రమశిక్షణను ఆశించే ఆచార్యుడు, నీవు ఉత్తిర్ణుడవు అయివుండవు అని చెప్పాడు.
ఆ యేడు ఆ విద్యార్థి చాలా కాలం మలేరియా పిడించింది. అందువల్ల అతను
ఉత్తీర్ణుడై వుండడని ఆచార్యునికి అనిపించింది. ఇలా జరగటానికి వీలులేదు
అన్నాడా బాలుడు ఆత్మవిశ్వాసంతో. అలాగే జరిగింది, అని ఆచార్యుడు చెప్పాడు.
'లేదు' అలా జరగటానికే వీలు లేదు. 'నేను చెబుతున్నాను కూర్చో. ఇంకేమైనా
మాట్లాడావంటే జరిమానా వేస్తాను.' 'నేను ఉత్తిర్ణుడనయ్యాను. ఇందులో ఏమాత్రం
సందేహంలేదు.ఐదు ఐదు రూపాయలు జరిమానా.' విద్యార్థి పట్టుదలతో తాను ఫెయిల్
కావటానికి అవకాశమే లేదని చెబుతూనే ఉన్నాడు. ఆచార్యుడు జరిమానా మొతాన్ని
పెంచుతూ పోసాగాడు . జరిమానా మొత్తం 50 రూ.ల దాకా పెరిగిపోయింది .ఆ సమయములో
అక్కడికి పాఠశాల లేఖరుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. బాలుడికి సైగ చేసి
తెలియయచేప్పాడు. తరువాత తెలిసింది. ఆ బాలుడే రాజేంద్రప్రసాద్. ఆయనే
స్వాతంత్ర్య భారతదేశానికి ప్రథమ రాష్ట్రపతి అయినాడు.
Subscribe to:
Posts (Atom)